విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో ఉన్న ఎన్సీపీ (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) అభ్యర్థి ఒకరు మరణించిన వైనం చోటు చేసుకుంది. జూబ్లీ ఉపపోరులో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం జరిగే కౌంటింగ్ ప్రక్రియ గురించి తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.
ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్న అతడు.. గురువారం రాత్రి వేళలో తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. దీంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. అన్వర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జూబ్లీ ఉపపోరులో కీలకమైన ఫలితాలు వెల్లడయ్యే రోజుకు కొన్ని గంటల ముందుగా చోటు చేసుకున్న ఈ ఉదంతం విషాదాన్ని నింపింది. అన్వర్ మరణం గురించి తెలుసుకున్న రాజకీయ వర్గాలు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.