ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం, మహిళా రైడర్లను ప్రోత్సహిస్తూ, ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు.