పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్.. జూన్ 18న ఏం జ‌ర‌గ‌నుంది..?

admin
Published by Admin — July 13, 2026 in Politics, Andhra
News Image

జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) రాజకీయ అరంగేట్రంపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఒకటే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18న తారక్ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. అయితే, ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎన్టీఆర్ అధికారిక బృందం అసలు నిజాన్ని వెల్లడించింది.

జూలై 18న జరగబోయేది ఎలాంటి రాజకీయ ప్రకటన కాదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఆ రోజు 'ఊరు వాడ(Ooru Vada)' అనే సరికొత్త సామాజిక కార్యక్రమాన్ని తారక్ ప్రజల ముందుకు తీసుకురానున్నారు. సమాజంలో మార్పు కోసం, ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ఆ రోజే అధికారికంగా వివరించనున్నారు. కాబట్టి ఇది కేవలం సామాజిక సేవా కార్యక్రమం మాత్రమేనని, దీనికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ(TDP) తరఫున ఎన్టీఆర్ ముమ్మరంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాలతోనే, ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. కానీ, ప్రస్తుతం తారక్ దృష్టంతా పూర్తిగా సినిమాలపైనే ఉందని ఆయన టీమ్ స్పష్టం చేసింది. చేతి నిండా భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో, వరుస షూటింగ్‌లతో ఆయన బిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని తేల్చిచెప్పారు.

నిర్ధారణ కాని వార్తలను, గాసిప్స్‌ను నమ్మి గందరగోళానికి గురికావద్దని ఎన్టీఆర్(NTR) టీమ్ అభిమానులకు, మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. జూలై 18న జరగబోయే 'ఊరు వాడ' కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడిస్తామని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ కాకపోయినా, తన అభిమాన హీరో సమాజం కోసం చేయబోయే ఈ సరికొత్త ప్రయత్నం ఏంటా అని నందమూరి అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags
Jr NTR NTR Ooru Vada NTR Political Entry TDP
Recent Comments
Leave a Comment

Related News