గతంలో ఎప్పుడూ లేని విధంగా.. దేశ చరిత్రలో తొలిసారి అన్నట్లుగా సంచలన తీర్పును ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్ లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి నిలిపి ఉంచిన నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకు చేరింది.