జగన్ కు హైకోర్టులో భారీ ఊరట

admin
Published by Admin — July 01, 2025 in Politics, Andhra
News Image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోయిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే జగన్ పై కూడా కేసు నమోదైంది. అయితే, తనపై కేసు క్వాష్ చేయాలంటూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది.

సింగయ్య మృతి కేసులో జగన్‌ను పోలీసులు విచారణ జరపవద్దని స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏజీ 2 వారాల గడువు కోరడంతో విచారణను వాయిదా వేసింది.

Tags
jagan singaiah died ap high court huge relief to jagan
Recent Comments
Leave a Comment

Related News

Latest News