 
    పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్యాన్ పార్టీలో చేరబోతున్నారంటూ గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసీపీ ఊదరకొడుతోంది. వర్మ ఏమి మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వల్లమాలిన కపట ప్రేమను కురిపిస్తోంది. అయితే టీడీపీతో వర్మకు అనుబంధం ఎక్కువ. టీడీపీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వర్మ.. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుండి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత చేతిలో వర్మ ఓటమి పాలయ్యారు.