అసెంబ్లీలో జగన్ ను ఉతికారేసిన ఉత్తమ్

admin
Published by Admin — January 03, 2026 in Telangana
News Image

2019-24 మధ్యకాలంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నపుడు ఈ ఇద్దరు నేతల మధ్య అండర్ స్టాండింగ్ వేరే లెవల్లో ఉంది. ఆ సమయంలో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రాకు కేసీఆర్ మేలు చేశారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ విషయం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. జగన్ తో దోస్తీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

ఏపీ మాజీ సీఎం జగన్ తో అలయ్ బలయ్ అంటూ తిరిగిన వాళ్లు...కృష్ణా జలాల్లో 3 టీఎంసీ నీళ్లు డైవర్ట్ చేసినా మాట్లాడలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. ప్రతి రోజు కలిసి కూర్చున్న వాళ్లు 45 టీఎంసీలు డయాఫ్రం తెలంగాణకే రావాలి అని ఏపీని ఒప్పించి తెచ్చి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయ్యేదని అన్నారు. వాళ్ల వైఫల్యాలు, తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, కేసీఆర్, జగన్ లను ఉత్తమ్ అసెంబ్లీలో ఉతికి ఆరేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Tags
jagan kcr uttam kumar reddy assembly sessions palamuru rangareddy project
Recent Comments
Leave a Comment

Related News