కేటీఆర్ కేసు..సుప్రీం కోర్టుకు రేవంత్ సర్కార్

admin
Published by Admin — January 07, 2025 in Politics
News Image

రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపించటం.. ఆ ఆరోపణల్ని ఆయనఖండించటమే కాదు.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లుగా తేల్చేశారు. అయితే.. ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. విచారణ వరకు వచ్చింది. ఏసీబీ ఎంట్రీ తర్వాత తెర మీదకు ఈడీ కూడా రంగంలోకి దిగటం.. దీనికి తోడు ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. రేసింగ్ ఉదంతానికి సంబంధించిన కేసు పట్టుబిగుసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాలు డిసెంబరు 31న వాదనలు ముగించారు. ఈ రోజు తీర్పు వెలువరించారు. కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏసీబీ తరఫు ఏజీ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని పేర్కొన్నారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించారన్నారు.

అయితే.. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. ఆయన్ను విచారణతో పాటు.. అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.
 
అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన రేవంత్ సర్కార్…ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
Recent Comments
Leave a Comment

Related News