ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఎమ్మెల్సీ సీటు ఆశించన రాధాకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలోనే త్వరలో భర్తీ కానున్న కీలకమైన నామినేటెడ్ పోస్టు ఒకటి రాధాకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.