స్టాలిన్ కామెంట్లకు మోదీ కౌంటర్

admin
Published by Admin — April 06, 2025 in Politics
News Image

తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలోని పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ దానిని జాతికి అంకితం చేశారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ పై మోదీ విమర్శలు గుప్పించారు. కొందరు కారణం లేకుండానే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారని స్టాలిన్ పై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 
Recent Comments
Leave a Comment

Related News

Latest News