గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

admin
Published by Admin — June 15, 2025 in Andhra, Politics
News Image

తమను గెలిపిస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తాం అని ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలకు ముందు వాగ్దానం చేయడం కామన్. అయితే, గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడం…తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అంతేకాదు, సరైన సమయంలో ఆ నియోజవర్గంలో సరైన నేత ఉండడం…పనులు చేయడం ఇంకా అరుదు. అలా అరుదైన నేతలలో ఒకరు టీడీపీ యువనేత, గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

గుంటూరు పార్లమెంట్ నియోకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు అనేకం ఉన్నాయి. దానికి తోడు జగన్ సర్కార్ విధ్వంసం వల్ల జిల్లా డెవలప్ మెంట్ లో వెనక్కు వెళ్లింది. ఈ దశలో గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రశేఖర్ ముందు అనేక సవాళ్లున్నాయి. ఆ సవాళ్లను స్వీకరించిన చంద్ర శేఖర్…వాటిని అధిగమిస్తూ ముందుకు వెళుతున్నారు. దశాబ్దాలుగా గుంటూరు నగరవాసులను ఇబ్బందిపెడుతున్న రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.

ఎంపీగా, కేంద్ర మంత్రిగా 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు. అంతేకాదు, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల కుదేలైన రాష్ట్ర ఖజానాపై ఒక్క రూపాయి భారం కాకుండా మొత్తం రైల్వే నిధులతో ఆ పనులు చేయించి గుంటూరు రూపురేఖలు మార్చారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు…తనపై, పార్టీపై నమ్మకంతో తనను గెలిపించిన ప్రజలకు…ఈ రకంగా చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.

 

Tags
7 railway over bridges central minister pemmasani chandrasekhar
Recent Comments
Leave a Comment

Related News