పాక్ గాలి తీసేస్తున్న ఇంటర్నేషనల్ మీడియా

admin
Published by Admin — March 01, 2025 in Politics
News Image

భారత్ మీద ఎన్నోసార్లు ప్లాన్ చేసి మరీ ఉగ్రదాడి చేయించినప్పటికీ చాలాసార్లు ముప్పు తప్పించుకున్న పాకిస్థాన్.. పహల్గాం దాడి తర్వాత మాత్రం భారత్ ఎదురుదాడిని తట్టుకోలేకపోతోంది. సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావడంతో పాటు పాక్ పీచమణిచే చర్యలు చాలానే చేపట్టిన భారత్.. తాజాగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడితో ఆ దేశాన్ని చావు దెబ్బ కొట్టింది.

భారత్ తమ దేశ సామాన్య పౌరులపై దాడి చేసిందని.. భారత్ దాడిని సమర్థంగా తిప్పి కొట్టామని పాక్ చెప్పుకుంటోంది కానీ.. అంతర్జాతీయ సమాజాన్ని ఈ విషయంలో ఒప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. భారత్ దాడి మీద ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న ఆ దేశ ప్రతినిధులు.. అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో పాక్ పరువు పోతోంది.

Tags
advia adivga dva adv ad da dvmdavhda dv 9adv sesi
Recent Comments
Leave a Comment

Related News