హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని చదును చేసే వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేతలు, హెచ్ సీయూ విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు, అక్కడ భూములు కొనేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.