2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలుపు బావుటా ఎగురవేశారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయ దుందుభి మోగించారు.
ఆలపాటి రాజాపై వైసీపీ పరోక్షంగా బలపరిచిన కేఎస్ లక్ష్మణరావుపై రాజా ఘన విజయం సాధించారు. లక్ష్మణరావుపై రాజా 82,319 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు రాగా లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.