ప‌వ‌న్ యూట‌ర్న్‌.. నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి క్యాన్సిల్‌!

admin
Published by Admin — March 04, 2025 in Politics
News Image

మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రి పదవి క్యాన్సిల్ అయ్యిందా..? అన్న విషయంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ యూట‌ర్న్‌ తీసుకున్నాడా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు నాగబాబు ఎమ్మెల్సీ అవ్వడం.. ఆ వెంటనే ఏపీ మంత్రివర్గంలో చోటు తగ్గించుకోవడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా ప్రకటించడంతో జనసైనికులు తెగ సంబర పడిపోయారు. కానీ అనూహ్యంగా నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి లేన‌ట్లే అని.. ఎమ్మెల్యే కూడా ఆయ‌న‌కు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్ర‌చారంతో ఏపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. అస‌లు జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతుంది అన్న చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. వాస్త‌వానికి పెద్ద‌ల స‌భ‌కు వెళ్లాల‌ని నాగ‌బాబు ముందు నుంచి ఆశ‌ప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పార్ల‌మెంట్ లో జ‌న‌సేన‌కు ప్రాతినిధ్యం ఉండాల‌ని భావిస్తున్నారు. పైగా ఏపీ మంత్రివ‌ర్గంలో ముగ్గురు మంత్రులు ఉండ‌గా.. వారిలో ప‌వ‌న్, కందుల దుర్గేష్ ఒకే స‌మాజిక వ‌ర్గానికి చెందిన‌వారు. ఇప్పుడు నాగ‌బాబు కూడా చేరితే జ‌న‌సేన కాపుల పార్టీగా ముద్ర ప‌డిపోతుంది. ఇది ప‌వ‌న్ కు ఏ మాత్రం ఇష్టం లేదు.

 

 

Recent Comments
Leave a Comment

Related News