ఏపీ మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఆరేళ్లుగా కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసులో సాక్షులు చనిపోతున్న వైనం కూడా చర్చనీయాంశమైంది. దీంతో, ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు గురించి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.