ఎంబీ వర్సిటీకి జరిమానా..మంచు విష్ణు క్లారిటీ

admin
Published by Admin — October 08, 2025 in Andhra
News Image

విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించడకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల నిలిపివేత వంటి ఆరోపణలు మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంపై వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంబీ యూనివర్సిటీపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) రూ.15 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,1752,872 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ వివరాలు తాజాగా వెబ్సైట్లో ఉంచడంతో ఈ వ్యవహారంపై మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై యూనివర్సిటీ ప్రో-చాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. ఎంబీ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కొన్ని సిఫార్సులు మాత్రమే చేసిందని గుర్తు చేశారు. ఆ సిపార్సులను వర్సిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ విషయం ఏపీ హైకోర్టులో విచారణలో ఉందని, ఆ సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు స్టే' ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి ఆ వివరాలు పోర్టల్ లో పెట్టడం దురదృష్టకరమని అన్నారు. తమ వర్సిటీ పరువుప్రతిష్ఠలు దిగజార్చడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags
manchu vishnu clarified fine imposed MB University
Recent Comments
Leave a Comment

Related News