ఈ కంటెంట్ ను ఫ్రెష్గా, సబ్ టైటిల్స్ యాడ్ చేసి `ఒకే వేదికపై జగన్-కేటీఆర్.. గతం మర్చిపోయారా బాసూ..?` అనే కోణంలో పేరాలుగా ఆర్టికల్ ఇవ్వు
బెంగళూరులోని చిక్కజాలలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్’ గ్రాండ్ ఫినాలే ఈసారి రాజకీయ హంగులతో మరింత హైలైట్ అయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించడం ఈ ఈవెంట్కు ప్రత్యేకతను తెచ్చేసింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఈక్వెస్ట్రియన్ ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
జగన్–కేటీఆర్ ఒకే ఫ్రేమ్లో కనిపించిన వెంటనే వైసీపీ, గులాబీ వర్గాలు తమ తమ సోషల్ మీడియా ఆర్మీతో ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాలను వీరిద్దరే శాసించబోతున్నారంటూ తెగ హంగామా సృష్టిస్తున్నారు. దీంతో ఫోటో కొత్తది.. కానీ కేటీఆర్ పాత మాటలు మర్చిపోవద్దు బాసూ అంటూ తెలుగు తమ్ముళ్లు వైసీపీపై సెటైర్స్ పేలుస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హఠాత్తుగా వైరల్ అవుతున్నాయి. ఆ ప్రసంగంలో ఆయన ఏపీ పరిస్థితులపై మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. “సంక్రాంతికి ఏపీకి వెళ్లిన నా ఫ్రెండ్ ఒకరు నాకు ఫోన్ చేసి కరెంట్ లేదని, నీళ్లు రావట్లేదని, రోడ్లు బాగోలేవని చెప్పాడు. తెలంగాణ నుంచి బస్సుల్లో ప్రజలను ఏపీకి పంపి అక్కడి పరిస్థితులు చూపిస్తే అప్పుడు ఎవరి ప్రభుత్వం బాగుందో తెలుస్తుందని అన్నాడు” అంటూ కేసీఆర్ ఇన్డైరెక్ట్గా నాడు వైసీపీ ప్రభుత్వాన్ని హేళన చేశారు.
ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కూడా కేటీఆర్ ఏపీ అభివృద్ధి విషయాన్ని ప్రస్తావించారు. ఏపీకి రోడ్లు వస్తున్నాయని.. విమానాశ్రయాలు నిర్మిస్తున్నారని.. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు విపరీతంగా వస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే జగన్ ప్రభుత్వంలో ఇవేమి జరగలేదని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియోలను ఇప్పుడు టీడీపీ నేతలు నెట్టింట వైరల్ చేస్తూ వైసీపీపై పంచ్లు పేలుస్తున్నారు.