డాక్టర్ రవి వేమూరు ఆధ్వర్యంలో డల్లాస్ లో లోకేశ్ సభ

admin
Published by Admin — November 26, 2025 in Nri
News Image
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించేందుకు అమెరికాతోపాటు పలు దేశాలలోని ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రవాసాంధ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు లోకేశ్ డల్లాస్ వెళ్లనున్నారు. డిసెంబరు 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డల్లాస్ లో జరిగే ఈ ధన్యవాద సభకు అమెరికాలో నివసించే ప్రవాసాంధ్రులంతా సకుటుంబ సపరివార సమేతంగా హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రతి వ్యక్తితో లేదా ప్రతి కుటుంబంతో లోకేశ్ ప్రత్యేకంగా ఫొటో దిగుతారు.

ఈ క్రమంలోనే ఈ ధన్యవాద సభను విజయవంతం చేసేందుకు ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు పెట్టుబడుల సలహాదారు డాక్టర్ రవి వేమూరి అమెరికాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో అతి భారీ కార్యక్రమంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఈ ఈవెంట్ ను జరిపేందుకు సన్నాహాలు మొదలుబెట్టారు. అమెరికా నలుమూలల నుంచి ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదేదో రాజకీయ సభలా కాకుండా అమెరికాలోని తెలుగు ప్రజలు ఒక చోట చేరి జరుపుకునే ఈ ఆత్మీయ సమ్మేళనం అని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు ప్రతీకగా జరగబోయే ఈ సభకు సంస్థలతో సంబంధం లేకుండా, అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రతి కుటుంబం హాజరుకావాలని కోరుతున్నారు. ఆ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ప్రదర్శనలు ఉండబోతున్నాయి. ఆహూతులందరికీ రుచికరమైన అచ్చ తెలుగు విందు భోజనం, వినోదం ఉంటుంది. ఈ ధన్యవాద సభలో పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు, ఐటీ కంపెనీల సీఈవోలతో కూడా లోకేశ్ భేటీ అయ్యే అవకాశముందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కంటే భారీ పెట్టుబడులు ఏపీకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Tags
minister lokesh dallas thanks meet APNRTS Chairman ravi vemuru
Recent Comments
Leave a Comment

Related News