వైసీపీ హయాంలో ప్రభుత్వం అండ చూసుకొని కొడాలి నాని మొదలు రోజా వరకు అందరూ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఆ నోళ్లు మూతబడ్డాయి. అంతేకాదు, కేసుల భయంతో చాలామంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నాయకులు భయపడుతున్నారని, ఒకరికి గుండెపోటు వచ్చిందని పరోక్షంగా కొడాలి నానిపై సెటైర్లు వేశారు.