సీఎం చంద్రబాబు ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కంపెనీలు క్యూ డుతున్న సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీతో పాటు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన పలు సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీబీఎన్ ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ను అమరావతికి చంద్రబాబు తాజాగా ఆహ్వానించారు. ఏపీలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.