అమ‌రావ‌తిలో మ‌ళ్లీ శంకుస్థాప‌న‌.. ఈ సారి ఏంటంటే!

admin
Published by Admin — December 26, 2025 in Andhra
News Image
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణ‌ ప‌నులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్ర‌ధాన న‌వ న‌గ‌రాల ప‌నుల్లో పురోగ‌తి పుంజుకుంది. దీంతో వివిధ సంస్థ‌లు అమ‌రావ‌తిలో త‌మ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వివిధ జాతీయ బ్యాంకులు.. త‌మ ప్ర‌ధాన కార్యాల‌యాల ను నిర్మించేందుకు వీలుగా శంకుస్థాప‌న‌లు చేశాయి. త్వ‌ర‌లోనే ఈ నిర్మాణాలు కూడా పూర్తి కానున్నాయి.
 
ఈ ప‌రంప‌ర‌లో తాజాగా మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది. న‌వ‌న‌గ‌రాల్లో ఒక‌టైన న్యాయ న‌గ‌రానికి సంబం ధించిన పనుల‌కు శంకుస్థాప‌న చేశారు. గురువారం సాయంత్రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పుర‌పాలక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌... స‌హా ప‌లువురు న్యాయాధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని శంకుస్థాప‌న చేశారు. న్యాయ న‌గ‌రంలో ప్ర‌ధానంగా.. రాష్ట్ర హైకోర్టును నిర్మించ‌నున్నారు. దీనిని మొత్తం 8 అంత‌స్థుల్లో నిర్మిస్తారు. దీనికే తాజాగా ంత్రి శంకుస్థాప‌న చేశారు.
 
రెండు ఫ్లోర్ల‌లోనూ.. పార్కింగ్‌కు కేటాయించ‌గా.. మిగిలిన వాటిలో 5వ ఫ్లోర్‌ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కార్యా లయానికి వినియోగిస్తారు. ఇత‌ర ఫ్లోర్ల‌లో ఒక‌టి.. బార్ అసోసియేష‌న్‌, న్యాయ‌వాదుల‌కు కేటాయిస్తారు. మిగిలిన‌వ‌న్నీ.. న్యాయ‌స్థానానికి కేటాయిస్తారు. ఈ నిర్మాణాల‌ను `నార్మ‌న్ ఫోస్ట‌ర్` సంస్థ‌కు అప్ప‌గించారు. గ‌తంలో 2014-19 మ‌ధ్య ఈ టెండ‌రును ఈ సంస్థే ద‌క్కించుకుంది. అయితే.. వైసీపీ వ‌చ్చాక ప‌నులు నిలిచిపోయిన నేప‌థ్యంలో తాజాగా ఈ సంస్థ‌కే ప‌నులు ఇచ్చారు.
 
ఇవీ విశేషాలు..
+ మొత్తం హైకోర్టు: 8 అంత‌స్థులు (జీ+7)
+ నిర్మాణానికి కేటాయించిన భూమి: 27 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు(25 ఎక‌రాలు దాదాపు)
+ మొత్తం 52 కోర్టు హాళ్లు నిర్మాణం.
+ 5వ అంత‌స్థులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కార్యాల‌యం, విశ్రాంతి భ‌వ‌నం ఏర్పాటు
+ నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేష‌న్ ఏర్పాటు.
+ 2027 నాటికి హైకోర్టు భ‌వ‌నాల నిర్మాణం పూర్తి చేయాల‌న్న‌ది ల‌క్ష్యం.
Tags
amarvati constructions high court building
Recent Comments
Leave a Comment

Related News