అసలు అంత పొద్దు పొద్దున్నే నిద్ర పోతున్న వారిని లేపి పెన్షన్లు ఇవ్వడం అవసరమా అంటూ వెంకట్రామిరెడ్డి తాజాగా చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. 5 గంటలకు పెన్షన్ ఇస్తున్నారని, 3 గంటలు లేటైతే ప్రపంచం తల్లకిందులైపోతుందా? అని ఆయన ప్రశ్నించిన వైనం వివాదాస్పదమైంది. వేరే ఊర్లో ఉన్న ఉద్యోగి ఎన్ని గంటలకు లేచి వచ్చి తెల్లవారుజామునే పెన్షన్లు పంపిణీ చేయాలని, ఆ సమయంలో ప్రయాణం ప్రమాదకరమని అంటున్నారు. ఇక, సమీక్షలు జరిగేటపుడు కిందిస్థాయి అధికారులను, ఉద్యోగులను ఉన్నతాధికారులు తిడుతున్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు.
ఇక, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆఫీసులకు వస్తే వారికి టీ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి పని చేసి పంపకుంటే మీ సంగతి చూస్తామని మంత్రులు వార్నింగ్ ఇస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఉద్యోగులను గౌరవించడం లేదని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా పని వాతావరణం కల్పించడం లేదని వెంకట్రామిరెడ్డి విమర్శించారు.
అయితే, వైసీపీ హయాంలో మాదిరిగానే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని, ఆ సమయంలో ప్రశ్నించని వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారో తెలియడం లేదని నెటిజన్లు అంటున్నారు. ఇక, వైసీపీ నేతలు చేసిన భూ