తన సొంత నియోజకవర్గం మంగళగిరిపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తనను గెలిపించారని.. మంగళగిరి ప్రలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. `మీ ఇల్లు-మీ లోకేష్` కార్యక్రమంలో భాగంగా.. శుక్రవారం పలువురికి ఇంటి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు.