వేడెక్కిన పిఠాపురం.. నాగ‌బాబుకు నిర‌స‌న సెగ‌..!

admin
Published by Admin — April 05, 2025 in Politics
News Image

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు టీడీపీ నుంచి నిరసన సెగ త‌గిలింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా శనివారం పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటించారు. మొదటిరోజు గొల్లప్రోలులో పలు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు నాగబాబు చేశారు. జనసేన, టీడీపీ శ్రేణులతో నియోజకవర్గంలో నాగబాబు మొదటి రోజు ప‌ర్య‌ట‌న అద్భుతంగా సాగింది. నాగ‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కానీ, రెండో రోజు మాత్రం తేడా కొట్టింది.

 
Recent Comments
Leave a Comment

Related News

Latest News