కేంద్ర బ‌డ్జెట్ పై బొత్స విమ‌ర్శ‌లు.. సాయిరెడ్డి ప్ర‌శంస‌లు!

admin
Published by Admin — February 02, 2025 in Politics, Andhra
News Image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ‌నివారం పార్లమెంట్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొత్తం రూ.50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ‌పెట్టారు. ఈ బడ్జెట్‌లో వేతనజీవులకు భారీ ఊరట ల‌భించింది. రూ.12 లక్షల వరకు టాక్స్‌ మినహాయింపునిస్తూ నిర్మ‌ల‌మ్మ ప్ర‌క‌టక చేయ‌డంతో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక‌పోతే కేంద్ర బ‌డ్జెట్ పై విజ‌య‌ సాయిరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సాయిరెడ్డి.. ఎక్స్ వేదిగా బ‌డ్జెట్ పై ట్వీట్ చేశారు. `2025 బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ గా గుర్తుండిపోతుంది. గౌరవనీయమైన నిర్మ‌లా సీతారామ‌న్ గారికి ఇది వ‌రుస‌గా 8వ బ‌డ్జెట్ కావ‌డం ఒక రికార్డు. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు, తగ్గిన కస్టమ్ డ్యూటీలు మరియు బలమైన ఆర్థిక సంస్కరణలతో ఈ బడ్జెట్ కష్టపడి పనిచేసే కుటుంబాలను శక్తివంతం చేస్తుంది మరియు దేశం యొక్క అభివృద్ధి పథాన్ని బలోపేతం చేస్తుంది.` అని విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే మ‌రోవైపు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కేంద్ర బ‌డ్జెట్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. స‌భ‌లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ నిర్మలా సీతారామన్ ఏపీకి చెందిన మహాకవి గురజాడ అప్పారావు కవితను ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మరిచిపోయార‌ని బోత్స మండిప‌డ్డారు. బీహార్ భారీగా లబ్ధి పొందింది.. కానీ ఏపీకి ఎటువంటి ప్రాధాన్య దక్కలేదన్నారు. ఈ బడ్జెట్ లో బీహార్ తో పోలిస్తే ఏపీకి దక్కింది శూన్యమ‌న్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉన్నా.. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని బొత్స విమర్శలు చేశారు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవంటూ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే.. కేంద్రం దానిని 41 మీటర్లకు కుదించి నిధుల కేటాయింపునకు అంగీక‌రించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. పోల‌వ‌రం ఎత్తు కుదింపుపై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని బోత్స డిమాండ్ చేశారు.

Recent Comments
Leave a Comment

Related News

Related News

ఏపీలో నమో అంటే నాయుడు మోదీ: లోకేష్ నమో...భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు షార్ట్ కట్. ఆయన అభిమానులు ముద్దుగా మోదీని నమో అని పిలుస్తుంటారు. ప్రపంచ దేశాలలో కూడా నమో బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా మోదీ సమకాలీకుడైన ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గ్లోబల్ ఇమేజ్ ఉంది. జాతీయ మీడియాలో చంద్రబాబును నాయుడు అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇకపై ఏపీలో నమో అంటే నాయుడు అండ్ మోదీ అని మంత్రి లోకేష్ కొత్త భాష్యం చెప్పారు. ఈ ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు పరుగులు పెడుతోందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త నగరాలు నిర్మించిన చరిత్ర ఉందని చెప్పారు. ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారని కితాబిచ్చారు. దేశవిదేశాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి చరిత్ర సృష్టిస్తున్నామని తెలిపారు. యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నామని, కేవలం 17నెలల్లో $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారును చూసి ఏపీలో పెట్టబడులు పెడుతున్నారని చెప్పారు.

Show All
Latest News