పది రూపాయిలు దానం చేసి పదిసార్లు చెప్పుకునే వారున్న ఈ రోజుల్లో కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియనివ్వని గొప్ప మనసున్న ప్రభాస్ కూడా ఉన్నాడు. రాజ్యాలు లేకపోవచ్చు.. కానీ ప్రభాస్ మాత్రం నిజంగా ఒక రాజే. అతని దాన గుణానికి దాసోహం కాని వారుండరు. ప్రభాస్ కు టాలీవుడ్ కర్ణుడు అనే పేరు కూడా ఉంది. అయితే ప్రభాస్ చేసే గొప్ప పనుల్లో బయటకు వచ్చేవి కొన్ని మాత్రమే.. కానీ బయటకు రానివి మరెన్నో. తాజాగా ప్రభాస్ కు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ బయట పెట్టారు.
బిల్ల చిత్రానికి రచయితగా పని చేసిన తోట ప్రసాద్ ఈరోజు సజీవితంగా ఉన్నారు అంటే అందుకు కారణం ప్రభాసే అట. ఓవైపు తన ప్రాణానికి ప్రాణమైన తండ్రి చనిపోయి శవమై ఉంటే.. మరోవైపు ప్రభాస్ మరో ప్రాణాన్ని నిలబెట్టేందుకు క్షణం కూడా ఆలోచించలేదట. తండ్రిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న సమయంలోనూ ప్రభాస్ తన దాన గుణాన్ని విడిచిపెట్టలేదట. ప్రభాస్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరచిపోలేనంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రచయిత తోట ప్రసాద్ తెలిపారు.