పాత్రికేయుడికి సహజసిద్ధమైన అధికారాల కంటే కూడా బాధ్యతే ఎక్కువగా ఉంటాయి. జర్నలిస్టుగా చెప్పుకుంటున్నప్పుడు విషయం ఏదైనా..దానికి సంబంధించిన అంశాలపై స్పందించేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నప్పటికీ.. పాత్రికేయ రంగానికి ఉండే ప్రత్యేక బాధ్యతను విస్మరించకూడదు. ఇవన్నీ చెబితే పాతచింతకాయ కబుర్లు వద్దన్న మాట అందరి నోటా వస్తుంది. దీనికి కారణం జర్నలిస్టు పేరుతో బోరు వేసే దగ్గర మొదలయ్యే దందా.. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోటుకు విస్తరించటమే.
మారిన కాలానికి తగ్గట్లు.. పాత్రికేయంలో విలువలు సన్నగిల్లి చాలా కాలమే అయ్యింది. రాజకీయ పార్టీలకు గొంతుగా మారటం.. వారికి తగ్గట్లుగా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు కనిపిస్తున్నదే. గతంలో జర్నలిస్టు అనే వాడికి కులం.. మతం.. ప్రాంతం.. రాజకీయ పార్టీ అనేది ఉండేది కాదు. జనహితమే తన హితంగా భావించేవాడు. డబ్బులకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీవీ డిబేట్ లలో పాల్గొనే వేళలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ నోరు జారితే వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకొని భేషరతు క్షమాపణలు చెప్పటం ఉంటుంది.

అందుకు భిన్నంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్టుగా పేర్కొనే (?) కృష్ణంరాజు నోటి నుంచి వచ్చిన మాటలు.. చేసిన చేష్టలు విన్నంతనే ఇలా కూడా మాట్లాడతారా? అన్న సందేహం కలుగుతుంది. డిబేట్ వేళ నోటికి వచ్చి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత అయినా తన తప్పును తెలుసుకొని జాగ్రత్తగా మసులు కుంటే బాగుండేది.కానీ.. అదేమీ చేయకుండా వివరణ పేరుతో ఆయన మరింత అసహ్యంగా మాట్లాడటం.. అమరావతిప్రాంత మహిళ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా చేసి.. తాను పరారీ అయిన సంగతి తెలిసిందే.ఇవే కాదు.. స్వధర్మ విజ్ఞాన వేదిక అధ్యక్షుడిగా చెప్పుకుంటారు. క్షత్రి హక్కుల సాధన సమితి అధ్యక్షుడిగా చెప్పుకుంటారు. కొద్దిరోజుల క్రితం బెజవాడ ప్రెస్ క్లబ్ తెరిచారు. ఆ తర్వాత ఆపేశారు. పూర్వ రంగంలో ఆయన పలు ఆసుపత్రులకు ప్రజాసంబంధాల అధికారిగా వ్యవహరించారు.అంతకు ముందు ఒక దినపత్రికలో చాలాకాలం సబ్ ఎడిటర్ గా.. మచిలీపట్నం స్టాఫ్ రిపోర్టర్ గా వ్యవహరించారు. ఇవే కాక గత ప్రభుత్వంలో పలు భూదందాలు.. సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.ఇవే కాదు.. స్వధర్మ విజ్ఞాన వేదిక అధ్యక్షుడిగా చెప్పుకుంటారు. క్షత్రి హక్కుల సాధన సమితి అధ్యక్షుడిగా చెప్పుకుంటారు. కొద్దిరోజుల క్రితం బెజవాడ ప్రెస్ క్లబ్ తెరిచారు. ఆ తర్వాత ఆపేశారు. పూర్వ రంగంలో ఆయన పలు ఆసుపత్రులకు ప్రజాసంబంధాల అధికారిగా వ్యవహరించారు.అంతకు ముందు ఒక దినపత్రికలో చాలాకాలం సబ్ ఎడిటర్ గా.. మచిలీపట్నం స్టాఫ్ రిపోర్టర్ గా వ్యవహరించారు. ఇవే కాక గత ప్రభుత్వంలో పలు భూదందాలు.. సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.కొమ్మినేని శ్రీనివాసరావు చొరవతో సాక్షి టీవీ చానల్ డిబేట్ లో రాజకీయ విశ్లేషకుడి రూపంలో కొత్త పాత్రను పోషిస్తున్న ఆయన.. కొన్ని అంశాలపై ఆయన చేసే వ్యాఖ్యలు నాసిరకంగా.. ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా ఉంటాయని చెబుతారు. ఇలా ఇంతకాలం నడిపిన ఆయన అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నారు. విజయవాడలోని అయోధ్య నగర లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉండటం.. కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరని చెబుతారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.