ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ అమరావతి రాజధాని డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టారు. మరోవైపు, యువ నేత, మంత్రి లోకేశ్ తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధిపై నవతరం ప్రణాళికలు రచిస్తున్నారు.