రేపటి నుంచి చంద్రబాబు యూఏఈ టూర్... షెడ్యూల్ ఇదే

admin
Published by Admin — October 21, 2025 in Andhra
News Image

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పెట్టుబడుల వేట మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, దావోస్, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా...ఇలా పలు దేశాలు చుట్టేస్తున్నారు. కాలికి బలపం కట్టుకొని విదేశీ పర్యటనలతో ఓ వైపు చంద్రబాబు..మరోవైపు లోకేశ్ బిజీబిబీగా ఉన్నారు. పండుగలు..పబ్బాల కన్నా రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని భావించిన లోకేశ్...దీపావళి నాడు ఆస్ట్రేలియాలో పెట్టుబడుల దివాళీ చేసుకున్నారు. ఇక, సీఎం చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు.

3 రోజుల టూర్ లో చంద్రబాబు 25 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. చంద్రబాబు అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్‌లో ల్యాండ్ అవుతారు. ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 వన్-టు-వన్ భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో బిజీబిజీగా ఉంటారు. 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సీఐఐ ఆధ్వర్యంలో ఒక రోడ్‌షో, తెలుగు ప్రవాసులతో మరో భేటీలో ఆయన పాల్గొంటారు. రోజుకు ఐదారు సమావేశాలతో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు.

అక్టోబర్ 22న చంద్రబాబు 5 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన వన్-టు-వన్ భేటీలు నిర్వహించనున్నారు. పర్యటనలో చివరి రోజు దుబాయ్‌లో ఏపీఎన్ఆర్‌టీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యంప చర్చించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రిరెడ్డి తదితరులు ఉంటారు.

Tags
cm chandrababu UAE tour Dubai Telugu Diaspora Meeting APNRTS investments
Recent Comments
Leave a Comment

Related News