2024 సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారిన జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు ప్రభుత్వంలో తన మార్క్ పాలనను చూపిస్తూనే.. మరోవైపు పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.