మావిగన్ పై జగన్ కు ఇచ్చి పడేసిన చంద్రబాబు!

admin
Published by Admin — May 06, 2026 in Andhra
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్‌(jagan).. ఏపీ రాజ‌ధానికి  మావిగ‌న్‌(mavigun) (మ‌చిలీప‌ట్నం+విజ‌య‌వాడ‌+గుంటూరు) ప్ర‌తిపాద‌న చేసిన విష‌యం తెలిసిందే. ఇది ఎంత‌గా అభాసుపాలైందో కూడా అంద‌రికీ విధిత‌మే. వైసీపీ నాయ‌కులు సైతం దీనిని స‌మ‌ర్థించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. మ‌రోవైపు ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద నను వ్య‌తిరేకిస్తూనే.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మ‌రింత విస్త‌రిస్తూ.. ఆర్థిక న‌గ‌రంగా రాజ‌ధానిని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి(amaravati) ఎక‌న‌మిక్ జోన్‌ను తాజాగా ప్ర‌క‌టించింది. దీనిని అభివృద్ది చేసేందుకు.. అం తర్జాతీయ‌స్థాయి సంస్థ‌ల‌ను ఆహ్వానించింది. ఈ అమ‌రావ‌తి ఆర్థిక ప్రాంతంలో 9 జిల్లాల‌ను ఏకం చేయ‌నున్నారు. వీటిలో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉమ్మ‌డి కృష్ణా, ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాల‌ను క‌లిపారు. మొత్తంగా 45 వేల చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల ప‌రిధిలో అమ‌రావ‌తి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ఈ ప్రాంతం రాజ‌ధానిలో కీల‌క పాత్ర పోషించ‌నుంది.

దీనికి సంబంధించి.. ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న చేయ‌డంతోపాటు.. అభివృద్ధికి సంబంధించిన సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చేందుకు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌ను ఆహ్వానించారు. ఈ మేర‌కు సీఆర్ డీఏ టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. దీని ప్ర‌కారం.. వ‌చ్చే ఆరు మాసాల్లో ప్ర‌భుత్వానికి ఆయా సంస్థ‌లు.. ప్ర‌ణాళిక‌ల‌ను,.. అందించాలి. ముఖ్యంగా రాబోయే భ‌విత‌వ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని డెవ‌ల‌ప్ చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది.

స్వర్ణాంధ్ర విజన్‌-2047 కు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని డెవ‌ల‌ప్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఆర్థిక, భూ వినియోగ ప్రణాళికలు, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అనుకూలమైన జీవన విధానం, సుస్థిరాభివృద్ధి వంటి ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఈ ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని ప్ర‌భుత్వం నిర్దేశించింది. ఈ ప్ర‌ణాళిక‌లు, న‌గ‌రాల అభివృద్ధికి.. సింగ‌పూర్ ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించ‌నుంది. ఆర్థికంగా ఆసియా డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ తోడ్ప‌డ‌నుందని ప్ర‌భుత్వం వివ‌రించింది. దీంతో మావిగ‌న్ అనే మాట ఇక వినిపించే అవ‌కాశం లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags
Cm chandrababu mavigun amaravati
Recent Comments
Leave a Comment

Related News