టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్సాఫీస్ దగ్గర రూటు మార్చారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న 'NBK111' షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 112వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ అయింది.
ఈ మెగా ఓపెనింగ్ ఈవెంట్కు ఏపీ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చిత్ర యూనిట్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం, తన మామ బాలకృష్ణ కొత్త సినిమాకు నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టడం ఈ వేడుకలోనే హైలైట్గా నిలిచింది. క్లాప్ పడగానే బాలయ్య తన మార్క్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ 'జై బాలయ్య' నినాదాలు మార్మోగిపోయాయి. ఈ ఈవెంట్లో బాలయ్య సాంప్రదాయ పట్టు దోతీ, కుర్తా లుక్లో కనిపించి ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించారు.
ఇక ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి లీక్ చేసిన బడ్జెట్ వివరాలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాలయ్య కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కొరటాల శివ(Koratala Siva) మార్క్ పవర్ఫుల్ సోషల్ మెసేజ్తో పాటు, నందమూరి అభిమానులు కోరుకునే ఊరమాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ స్క్రిప్ట్ను డిజైన్ చేశారట. ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026 నుంచి ప్రారంభం కానుంది. సమ్మర్ 2027 కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, విలన్ మరియు టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.