భారతదేశపు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా జరిగాయి. సాన్ జోస్ డౌన్టౌన్లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) నిర్వహించిన ‘AIA SWADES 2026 పరేడ్’ ఘనంగా ముగిసింది. ప్రముఖ సినీ నటి, గ్రాండ్ మార్షల్ తాప్సీ పన్ను బే ఏరియాలోని అతిపెద్ద బహుళజాతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 25 వేలకు పైగా ప్రజలు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. 80కి పైగా ఫ్లోట్లు మరియు మార్చింగ్ గ్రూపులు, 50కి పైగా భారతీయ-అమెరికన్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పరేడ్ నభూతో నభవిష్యత్ అన్నరీతిలో జరిగింది.
ఈ కార్యక్రమంలో వేలాది కుటుంబాలు, సంస్థలు, సాంస్కృతిక బృందాలు, ఎన్నికైన అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వేలాది మంది భారతీయ-అమెరికన్ సమాజ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ వైవిధ్యం, వారసత్వం మరియు భారత్, అమెరికాల మధ్య నిలకడగా ఉన్న స్నేహానికి చిహ్నంగా ఈ పరేడ్, వేడుకలు జరుపుకున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు, సంప్రదాయాలు మరియు సమాజ సంస్థలను ప్రతిబింబించేలా 80కి పైగా ఫ్లోట్లు, మార్చింగ్ గ్రూపులు ఈ పరేడ్ లో పాల్గొన్నాయి. 80 అడుగుల భారత్ & అమెరికా జెండా వాక్, తిరంగా వాక్, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు, బే ఏరియా సమాజ భాగస్వామ్యం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
ఈ పరేడ్ బే ఏరియాలోని భారతీయ-అమెరికన్ సమాజాల కలయికకు, భారతదేశపు అసాధారణ వైవిధ్య ప్రదర్శనకు వేదికగా నిలిచింది. అమెరికాలో ఉన్నప్పటికీ స్వదేశంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ వేడుక ఒక ప్రత్యేక అవకాశం కల్పించింది. ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ‘AIA SWADES 2026’ పరేడ్, వేడుకలకు గ్రాండ్ మార్షల్గా వ్యవహరించి నాయకత్వం వహించారు.
మహిళా సాధికారత, మానవత్వం, సామాజిక సమస్యలు మరియు సందేశాత్మక చిత్రాలలో విలక్షణ పాత్రలలో అద్భుతంగా నటించిన తాప్సీ ప్రేక్షకులను విమర్శకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు ఆమె అదనపు ఉత్సాహాన్ని తెచ్చారు. వేలాది మంది సమాజ సభ్యులు పరేడ్ సమయంలో గ్రాండ్ మార్షల్ తాప్సీకి ఘన స్వాగతం పలికారు. భారతీయ-అమెరికన్ సమాజం, అమెరికాల మధ్య బలమైన సంబంధాన్ని SWADES వేడుక మరోసారి చాటిచెప్పింది.
భారతదేశపు కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, సాన్ జోస్ మేయర్ మాట్ మహాన్, యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు సామ్ లిక్కార్డో, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్ మరియు కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యులు ఆష్ కల్రా, ప్యాట్రిక్ అహ్రెన్స్తో పాటు సిలికాన్ వ్యాలీలోని సమాజాలను ప్రాతినిధ్యం వహించే 40కి పైగా ఎన్నికైన అధికారులు జెండా ఎగురవేసే కార్యక్రమం మరియు పరేడ్, వేడుకలకు హాజరయ్యారు.
ఎన్నికైన నాయకులు, సమాజ సంస్థలు మరియు కుటుంబాల భాగస్వామ్యంతో కూడిన ఈ వేడుక బే ఏరియాలో భారతీయ-అమెరికన్ సంస్కృతి మరియు సమాజ జీవితం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
100కి పైగా పిల్లలు శాస్త్రీయ మరియు సినిమా నృత్య ప్రదర్శనలలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. కళలు, చదరంగం మరియు వ్యాస రచన పోటీలు వంటి ఈవెంట్స్ లో పిల్లలు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను AIA నిర్వహిస్తోంది.
పరేడ్ తర్వాత ఉచిత డే & నైట్ మేళాతో వేడుక కొనసాగింది. ఇందులో భారతీయ ఆహారం, షాపింగ్, సాంస్కృతిక వినోదం, కుటుంబ కార్యకలాపాలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఉన్నాయి.
‘విజయ్ భారత్’ అనే గొప్ప సాంస్కృతిక ప్రదర్శనతో వేడకల రోజు సాయంత్రం ఆహ్లాదకరంగా మారింది. భారతీయ సంప్రదాయాలకు, ప్రాంతీయతకు ప్రాధాన్యతనిచ్చే నృత్యాలు, సంగీతం మరియు వినోదం పంచే కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు, పరేడ్ సాన్ జోస్ లో భారతీయ సంస్కృతి మరియు సమాజం యొక్క ప్రాధాన్యతను చాటిచెప్పాయి.
ఈ ఈవెంట్ హైలైట్స్:
25,000+ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సాన్ జోస్ డౌన్టౌన్ లో సందడి చేశారు
80+ ఫ్లోట్లు మరియు మార్చింగ్ గ్రూపులు భారతదేశ వైవిధ్యం మరియు సృజనాత్మకతను ప్రదర్శించాయి
50+ భారతీయ-అమెరికన్ సంస్థలు భారత వారసత్వాన్ని జరుపుకోవడానికి ఏకమయ్యాయి
40+ ఎన్నికైన అధికారులు పాల్గొని తమ మద్దతును తెలిపారు
1 చారిత్రక భారత దినోత్సవ పరేడ్ ఇండో-అమెరికన్ సమాజాన్ని ఏకం చేసింది
1 గ్రాండ్ మార్షల్ తాప్సీ పన్ను వేడుకకు నాయకత్వం వహించారు
India & USA జెండా వాక్ స్నేహం మరియు సామాన్య ప్రజాస్వామ్య విలువలను సూచించింది
డే & నైట్ మేళా సాన్ జోస్ లో ఆహారం, సంస్కృతి, వినోదం, షాపింగ్ లతో అలరించింది
25,000కు పైగా సమాజ సభ్యులకు AIA హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. వారి వల్ల SWADES 2026 అసాధారణ విజయం సాధించింది. 50కి పైగా సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, స్పాన్సర్లు, సాంస్కృతిక ప్రదర్శకులు, కళాకారులు, ఎన్నికైన అధికారులు, నగర భాగస్వాములు, మీడియా భాగస్వాములు మరియు వేడుకకు తమ సమయం, శక్తి మరియు వనరులను అందించిన ప్రతి ఒక్కరికీ కూడా ఏఐఏ ధన్యవాదాలు తెలిపింది.
ఈవెంట్ స్పాన్సర్లు:
సంజీవ్ గుప్తా CPA గ్రాండ్ స్పాన్సర్, ప్లాటినం స్పాన్సర్ లవణ్య దువ్వి (రియల్టర్), ట్రావెలోపాడ్ (ట్రావెల్ పార్టనర్), రియల్టర్ నాగరాజ్ అన్నయ్య ద్వారా పవర్డ్, లైఫాలజీ (ఎడ్యుకేషనల్ పార్టనర్). సిల్వర్ స్పాన్సర్లు: ఇన్స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, వాచి సిల్క్స్, మైపర్సు, సియెర్రా పసిఫిక్, అపెక్స్ కన్సల్టింగ్, కావ్య ఫుడ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), శాస్త్ర ఫుడ్స్ మరియు ఇతర సమాజ భాగస్వాములు. ఈ ఈవెంట్ స్పాన్సర్లకు, వారు నిరంతరం ఇచ్చిన మద్దతుకు ఏఐఏ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు స్వచ్ఛంద సేవకులకు ధన్యవాదాలు తెలియజేసింది. యో ఇండియా టీవీ, టీవీ9, నమస్తే ఆంధ్ర, దియా టీవీ, సుమన్ టీవీ మరియు ఇతర మీడియా భాగస్వాములకు కూడా ఏఐఏ ధన్యవాదాలు తెలిపింది.
త్వరలో జరగబోతున్న కార్యక్రమాలు:
గణపతి బప్పా మోరియా— సెప్టెంబర్ 19 (శనివారం) — బిషప్ రాంచ్, సాన్ రామోన్
దసరా దీపావళి ధమాకా (DDD-2026) — ఇది వార్షిక ఫ్లాగ్షిప్ కార్యక్రమం. మహామంగళ ఆరతి, రథయాత్ర, ఫైర్వర్క్స్, రావణ దహనం + మరిన్ని ప్రత్యేక వేడుకలు ఉంటాయి. ఈ కార్యక్రమం అక్టోబర్ 17 (శనివారం)న ప్లెజంటన్లోని అలమెడా కౌంటీ ఫెయిర్గ్రౌండ్స్లో జరుగుతుంది.
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) సాంస్కృతిక, పౌర, విద్యా మరియు సమాజ కార్యక్రమాల ద్వారా భారతీయ-అమెరికన్ సమాజాన్ని ఏకం చేయడానికి మరియు భారతదేశం-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పడిన ఒక సంస్థ.
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), సాన్ జోస్, కాలిఫోర్నియా మరియు దాని కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలకు www.aiaevents.org సందర్శించండి.