టీటీడీ గోశాల ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తిరుమల శ్రీవారి గోశాలలో గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అత్యంత పవిత్రమైన టీటీడీ గోశాల పరిస్థితి చాలా దారుణంగా మారిందని.. గోవుల మరణాలను దాచిపెట్టారని భూమన వ్యాఖ్యానించారు. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే భూమన ఆరోపణలపై తాజాగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.