పాస్టర్ ప్రవీణ్ కుమార్.. మృతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. ఇది హత్యేనని కొందరు వాదనకు దిగారు. రాజకీయంగా కూడా ఇది పెద్ద విషయంగా తెరమీదికి వచ్చింది. అనేక వార్తలు.. అనేక విమర్శలు.. కూడా ఈ మృతి చుట్టూ చోటు చేసుకున్నాయి. తాజాగా దీనిపై ఏలూరు ఐజీ అశోక్కుమార్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు.