(TANA) వారు నిర్వహిస్తున్న 24వ ద్వైవార్షిక మహా సభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభలను ‘తానా’ నిర్వాహకులు జరుపుతున్నారు.
తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఈ వేడుకలు ఈ ఏడాది డెట్రాయిట్లో జరగనున్నాయి.
ఈ మహాసభలకు ఏపీ, తెలంగాణ నుంచి ఎంతోమంది తెలుగువారు హాజరవుతుంటారు.
ఈ క్రమంలోనే ఏపీ నందిగామ శాసనసభ్యులు/ప్రభుత్వ విప్ ‘సౌమ్య తంగిరాల’ ఈ ఏడాది తానా సభలకు హాజరు కాబోతున్నారు.
నందిగామ శాసనసభ్యులు/ప్రభుత్వ విప్ ‘సౌమ్య తంగిరాల’ బుధవారం రాత్రి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాషింగ్టన్ డిసి బయలుదేరారు.
ఈ క్రమంలోనే తంగిరాల సౌమ్య గారిని ఆమె అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.