లోకేశ్ తో వంగవీటి రాధా భేటీ

admin
Published by Admin — September 03, 2025 in Andhra
News Image

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి తరఫున టీడీపీ నేత వంగవీటి రాధా ముమ్మరంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. అయితే, కూటమిలోని వివిధ పార్టీలు, సమీకరణాల నేపథ్యంలో రాధాకు ఆ పదవి మాత్రమే కాదు ఎటువంటి నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదు. దీంతో, రాధా అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్ నుండి రాధాకు పిలుపు వచ్చింది. దాదాపు 11 నెలల విరామం తర్వాత లోకేశ్ తో రాధా భేటీ కాబోతుండడంతో ఆ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ భేటీ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు రాధా రానున్నారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు గురించి లోకేశ్ నుంచి స్పష్టమైన హామీ ఈ భేటీ తర్వాత వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. రాధాకు ఏ పదవి ఇవ్వబోతున్నారన్న విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ రాధా టీడీపీ తరఫున, కూటమి పార్టీల అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేశారు. వైసీపీపై, జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Tags
vangaveeti radha minister lokesh meeting nominated post
Recent Comments
Leave a Comment

Related News