కోనసీమలో ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురి మృతి

admin
Published by Admin — October 08, 2025 in Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాద ఘటన జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడ సజీవ దహనమయ్యారు. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు చనిపోయారు. ఈ ప్రమాద సమయంలో 40 మంది లోపల పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ పేలుడు ధాటికి ఆ బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన స్థలాన్ని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలు, వైద్యసాయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలలో పాల్గొనాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు.

Tags
konaseema crackers godown fire accident 6 people died
Recent Comments
Leave a Comment

Related News