తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ విచారణ సందర్భంగా కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. తెలంగాణలో బీసీలు 56.7% ఉన్న సంగతి వాస్తవమేనని, కానీ, రాజ్యాంగబద్ధంగా వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబు కాదని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని, గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే అది చట్టమవుతుందని ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు.