ముగ్గురు కర్మయోగులు...పిక్ ఆఫ్ ది డే

admin
Published by Admin — October 16, 2025 in Andhra
News Image
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భ:గా దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని మోదీ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ శ్రీశైలం మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు సంప్రదాయ వస్త్రాల్లో సామాన్యుల మాదిరి కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటో వైరల్ అయింది.


సాదాసీదా మనుషుల మాదిరిగా ఓ అరుగు మీద ఇరుగుపొరుగు మాదిరి ఈ ముగ్గురు నేతలు కూర్చున్న ఫొటో..పిక్ ఆఫ్ ది డేగా నిలిచింది. దాంతోపాటు, శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారం దగ్గర కూడా ఈ ముగ్గురు సంప్రదాయ వస్త్రాల్లో నుదుట బొట్టుతో దిగిన ఫొటో కూడా వైరల్ అయింది. కేంద్రంలో ప్రధాని మోదీ...రాష్ట్రంలో చంద్రబాబు, పవన్...ఇలా ఆధ్యాత్మిక భావాలు, దైవ భక్తి కలిగిన ఈ ముగ్గురు నేతలు త్రిమూర్తులు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ పర్యటనతో శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాలుగో భారత ప్రధాని మోదీ నిలిచారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని హోదాలో మోదీ శ్రీశైలానికి రావడం ఇదే తొలిసారి. శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించారు. దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరాన్ని, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు.

News Image
Tags
pm modi cm chandrababu deputy cm pawan devotional mode pic gone viral
Recent Comments
Leave a Comment

Related News