తిరుపతిలో 3 వేల కోట్లతో ఆధ్యాత్మిక టౌన్షిప్!

admin
Published by Admin — November 28, 2025 in Andhra
News Image

తిరుపతిలో 600 ఎకరాల్లో రూ.3 వేల కోట్లతో ఆధ్యాత్మిక టౌన్షిప్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. టౌన్షిప్ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ...అనగాని సహకారం కోరింది. టౌన్షిప్ నిర్మాణ స్వరూపాన్ని అనగానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు వివరించారు.

ఆ టౌన్షిప్ లో 5 వేల సంవత్సరాల హిందు ధర్మం సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. వసుధైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. నిర్మాణానికి త్వరగా అనుమతులిచ్చేలా సహకరిస్తామని డెల్లా గ్రూపు ప్రతినిధులకు అనగాని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని అన్నారు.

Tags
Tirupati devotional township 3 thousand crores minister anagani satya prasad
Recent Comments
Leave a Comment

Related News