అమరావతికి చట్టబద్ధత..బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో సంబరాలు

admin
Published by Admin — April 04, 2026 in Nri
News Image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక, లాంఛనంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లో ఉన్న ఎన్నారైలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ల పిలుపు మేరకు వీధుల్లోకి వచ్చి దీపాలు వెలిగించి తమ హర్షం వ్యక్తం చేశామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నేతలు భక్త బల్ల, సుభా యంత్ర, వెంకట్ అడుసుమిల్లి, సత్యం పసల, కరీం, ప్రసాద్ బండారు, వెంకట్ గుడాల, జగదీష్ తాల్లూరి, భీమ్ బొమ్మ, శ్రీనివాస్ వీరమాచినేని, రవి మేడెపూడి, వంశీ కట్ట, మధు కట్ట, కిషోర్ బుద్ధ, సురేష్ నల్లపాటి, రాజేష్ నల్లూరి, భాను బిరుదురాజు, ప్రదీప్ నర్రా, నిఖిల్ దాది, సుధీర్ ఉన్నం, కరీమ్, ప్రేమ్ మక్కెన, సునీల్ సుదనగుంట పాల్గొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు చరిత్రాత్మక ఘట్టమని, ప్రతి ఆంధ్రుడికి ఇది గర్వకారణమని వారు అన్నారు. ఇది తెలుగు ప్రజల విజయమని, దేవతల రాజధాని అమరావతికి భగవంతుడి మద్దతు ఉందని, దాని ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరని చెప్పారు.

News Image
News Image
News Image
News Image
News Image
Tags
Bay area NRI TDP leaders celebrations amaravati bill passed rajyasabha
Recent Comments
Leave a Comment

Related News

Latest News