టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో మూడో రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారి రాజేష్ గారు ప్రత్యేకంగా పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు సుభిక్షం కలగాలని కిలారి రాజేష్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ గారు పాల్గొన్నారు.