రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఒకప్పుడు పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన ముఖ్య నేత, ఇప్పుడు అదే పార్టీకి అతి పెద్ద సవాల్గా మారితే అధినాయకత్వం ఎలా స్పందిస్తుంది? సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వైవీ సుబ్బారెడ్డి నుంచి సొంత కుటుంబ సభ్యుల వరకు ఎవరిపై విమర్శలొచ్చినా క్షణాల వ్యవధిలో ఖండించే వైసీపీ(YCP) హైకమాండ్, విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం అపూర్వమైన మౌనాన్ని పాటిస్తోంది. అసలు ఈ సైలెన్స్ వెనుక మర్మమేంటి?
కొద్దికాలంగా విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) సంధిస్తున్న అస్త్రాలు సాధారణమైనవి కావు. నేరుగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని, పార్టీ విధానాలను టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న మతపరమైన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీలో పదవులు దక్కాలంటే మతం మారాల్సిందేనంటూ ఆయన సంధిస్తున్న సంధులు వైసీపీని డిఫెన్స్లో పడేశాయి. సాధారణంగా ఇలాంటి సున్నితమైన, తీవ్రమైన ఆరోపణలు వస్తే పార్టీ శ్రేణులు విరుచుకుపడాలి. కానీ, ఇక్కడ ఎటువంటి స్పందన లేదు. అయితే దీనికి ప్రధాన కారణం సాయిరెడ్డి చేతిలో ఉన్న 'అస్త్రాలే'ననే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల అధికార కాలంలో ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించిన ప్రతి కీలక పరిణామం, గండికోట వంటి రహస్యాలు, పార్టీలోని కోటరీ లోగుట్టు అన్నీ ఆయన కంటిసన్నల్లోనే నడిచాయి. అప్పట్లో అన్నీ తానై వ్యవహరించిన వ్యక్తి కావడంతో, ఆయన దగ్గర పార్టీకి నష్టం కలిగించే సున్నితమైన సమాచారం ఎంతో ఉందనే భయమే జగన్ను, పార్టీ పెద్దలను కట్టడి చేస్తోందనే వాదన బలపడుతోంది.
తనను రెచ్చగొట్టాలని చూస్తే అది పార్టీ రాజకీయ భవిష్యత్తుకే ముసలవుతుందంటూ సాయిరెడ్డి గతంలో ఇచ్చిన పరోక్ష హెచ్చరికలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. తనపై కౌంటర్లు వేస్తే మరింత తీవ్రమైన విషయాలు బయటపెడతాననే రీతిలో ఆయన వ్యవహరిస్తుండటంతో, వైసీపీ(YCP) నేతలు తమ నోళ్లకు తాళం వేసుకోవాల్సి వస్తోంది. ఏ చిన్న రియాక్షన్ ఇచ్చినా అది రివర్స్ అయ్యి తమకే నష్టం చేస్తుందనే ముందస్తు అప్రమత్తతే ఈ మౌనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, ఒకనాడు తన కనుసన్నలతో పార్టీని, ప్రభుత్వాన్ని శాసించిన జగ(Jagan)న్.. ఇప్పుడు అదే మాజీ సహచరుడి విషయంలో చేసేదిలేక మౌనం వహించాల్సిన పరిస్థితి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సాయిరెడ్డి ఆరోపణలను తిప్పికొట్టలేక, అలాగని మిన్నకుండిపోలేక వైసీపీ అధినాయకత్వం పడుతున్న ఈ మథనానికి ముగింపు ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.