ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంతో బిగ్ ఫైట్‌..!

admin
Published by Admin — July 21, 2026 in Politics, Andhra
News Image

హస్తిన వేదికగా మరోసారి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ(AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) బుధ‌వారం హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంచలన బిల్లుల వెనుక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో.. బాబు నేరుగా రంగంలోకి దిగడం అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఎన్డీయే(NDA) సర్కార్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు, ఇప్పుడు దేశ ప్రయోజనాలతో పాటు దక్షిణాది హక్కుల కోసం గట్టిగా నిలబడేందుకు సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో చేపట్టనున్న సీట్ల పునర్విభజన వల్ల జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయనే ఆందోళన తీవ్రంగా ఉంది. ఈ విషయంలో కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా సవరణలు చేయాలంటూ ఆయన ఢిల్లీ వేదికగా గళం విప్పనున్నారు.

కేవలం డిలిమిటేషన్(Delimitation) మాత్రమే కాకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా జాతీయ స్థాయిలో తన మార్కు చక్రం తిప్పుతున్నారు. పార్లమెంట్‌లో మూడొంతుల మెజారిటీ సాధించేందుకు వీలుగా విపక్షాలతో పాటు వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో ఆయన అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. పొత్తులో ఉంటూనే ప్రాంతీయ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని బాబు అమలు చేస్తున్నారు.

అంతేకాకుండా, నవ్యాంధ్ర ప్రయోజనాలే పరమావధిగా ఆయన ఈ పర్యటనను వాడుకోనున్నారు. రాజధాని అమరావతి(Amaravati) పునర్నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం, జీవనాడి పోలవరం పనుల వేగవంతం, కేంద్రం నుంచి రావాల్సిన బాకీల విడుదలపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు కీలక మంత్రులను కలిసి ముఖాముఖి తేల్చుకోనున్నారు. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా బాబు వేస్తున్న ఈ అడుగులు ఢిల్లీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.

Tags
Chandrababu Naidu Delhi National Politics Delimitation Bill Womens Reservation NDA Chandrababu Delhi Tour
Recent Comments
Leave a Comment

Related News