గన్నవరం లోని టీడీపీ ఆఫీసుపై 2021-22 మధ్య జరిగిన దాడి, ఘర్షణకు సంబంధించిన వ్యవహారం తారస్థాయికి చేరుకుంది. నిన్న మొన్నటి వరకు కేవలం నాలుగైదు జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, జైలు.. తర్వాత మంగళవారం జగన్ ఆయనను పరామర్శించడంతో ఈ కేసు వ్యవహారం ఏంటనేది సోషల్ మీడియాలో అత్యంత ఆసక్తికర విషయంగా మారింది. మంగళవారం రాత్రికి గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశంగా కూడా గన్నవరం టీడీపీ ఘటన రికార్డు సృష్టించింది.