వైసీపీ హయాంలో ఆంధ్రుల రాజధాని అమరావతి ని జగన్ అటకెక్కించిన సంగతి తెలిసిందే. అమరావతిపై వైసీపీ నేతలతో పదేపదే దుష్ప్రచారం చేయించి…అమరావి నిర్మాణ పనులను అర్ధాంతరంగా జగన్ నిలిపివేశారు. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మార్చి 15 నుంచి నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్న సమయంలో అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో, అమరావతి పనులకు బ్రేక్ పడినట్లయింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తాజాగా తీపి కబురు చెప్పింది.