ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల భూ దందాలు, భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం బట్టబయలైంది. ఇక, తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారంపై హైకోర్టు కూడా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే నేడు కోర్టు ఆదేశాల ప్రకారం సజ్జల ఎస్టేట్ లో భూమి రీ సర్వేను అధికారులు చేపట్టారు.