తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అక్రమాలను బయట పెట్టిన వారిని చంపేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తాజాగా భూపాలపల్లి జిల్లాలో జరిగిన మేడి గడ్డ రిజర్వాయర్ కుంగుబాటు ఘటనపై ఫిర్యాదు చేసిన రాజలింగ్ హత్యపై మంత్రి స్పందించారు. ఈయన హత్యకు గలకారణాలను సాధ్యమైనంత వేగంగా వెలకి తీస్తామన్నారు.